బేగంపేట జూలై 26: సికింద్రాబాద్లో బోనాల ఉత్స వాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సాక సమర్పణ భవిష్యవాణి, బలి, పోతరాజుల విన్యాసాలు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు, ఫలహార, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపు శోభాయామానంగా సాగింది. పోతరాజుల విన్యాసాలు, కళాకారుల వేషధారణలు, ఘటాల ఊరేగింపులతో లష్కర్ పుర వీధులన్నీ మార్మోగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ప్రధాన రహదారులతో పాటు పురవీధుల్లో అమ్మవారి నామస్మరణలు, భక్తుల విశేష పూజలు అలరించాయి.
రాంగోపాల్పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించిన అనంతరం భవిష్యవాణి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి ప్రీతి ప్రాయంగా తయారు చేసి ఫలహారాలు బండిలో పెట్టి ఊరేగింపు నిర్వహించారు. ప్రధానంగా శివాజీనగర్ డొక్కలమ్మ, రాష్ట్ర పతి రోడ్లోని దండు మారెమ్మ, సెయింట్ మేరీస్ రోడ్లోని పీనుగుల మల్లన్న, సెకండ్ బజార్లోని పోచమ్మ, ముత్యాలమ్మ, కళాసీగూడలోని శ్రీదేవి పోచమ్మ, స్టేషన్ రోడ్లోని రేణుకా ఎ ల్లమ్మ, తదితర ఆలయాల్లో రంగం నిర్వహించి భవిష్యవాణి వినిపించారు.