మేడ్చల్ రూరల్, మార్చి 10: అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, వారిని మహిళా దినోత్సవం రోజుననే కాకుండా ప్రతి నిత్యం గౌరవించాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన మహిళా దినోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు మహిళలు ఇంటి పనులతో పాటు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించి తమ వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మంత్రి కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.