మేడ్చల్,(నమస్తే తెలంగాణ)/మేడ్చల్ జోన్బృందం,జనవరి 19: సంపూర్ణ అంధత్వ నివారణే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మి క శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి మొదటి రోజు ప్రజల అనూహ్య స్పందన లభించింది.జవహర్నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, పోచారం మున్సిపాలిటీల్లో గురువారం కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో ఎవరూ కూడా కంటి సమస్యలతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీర్ రూపకల్పన చేశారని అన్నారు.
శిబిరంలో వైద్య పరీక్షలతో పాటు కంటి అద్దాలను పంపిణీ చేస్తామని, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు కూడా చేయిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జవహర్నగర్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, మేయర్ కావ్య కమిషనర్ రామలింగం, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్సభ్యులు, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పోచారంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, చైర్మన్లు పావనీ జంగయ్య యాదవ్, కొండల్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.
గతంలో నా కండ్లు చాలా మసకగా కనిపించేవి. ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరిగి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. కంటి వెలుగు కార్యక్రమంతో ఉచితంగా పరీక్షలతో పాటు మందులు, కంటి అద్దాలు ఇచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా మా డివిజన్కు వచ్చి పరీక్షలు చేశారు. మా లాంటి పేద ప్రజలకు కంటి వెలుగు దేవుడిచ్చిన వరంలాంటింది. -మొగులయ్య, మల్కారం
కొంతకాలంగా కంటి సమస్యతో బాధపడుతున్నాను. ప్రైవేటు దవాఖానకు వెళ్లాలంటే పైసలు లేవు. దీంతో అట్లానే కాలం వెళ్లదీశాను. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పెట్టడంతో కంటి పరీక్షలు చేయించుకున్నాను. నాకు వెంటనే కంటి అద్దాలు ఇచ్చారు. అంధత్వ నివారణ రాష్ట్రంగా మారుస్తున్నందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. -మోహబూబా, మల్కారం
కంటి చూపుతో సమస్యతో ప్రతి రోజూ నేను చాలా ఇబ్బం దులు అనుభవిస్తునాను. కంటి వెలుగు శిబిరంలో అను భవజ్ఞులైన డాక్టర్లు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు. ప్రైవేటు దవాఖానలకు వెళితే చాలా ఖర్చు అయ్యేది. ప్రభుత్వం ఉచితం గా కంటి పరీక్షలు చేసి నా జీవితంలో కొత్త వెలుగు నింపింది. కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. -సైమాన్, ఇందిరానగర్, మల్కారం