జవహర్నగర్, మార్చి 15 : దేశానికి బీఆర్ఎస్ పార్టీనే దిక్సూచిగా నిలుస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జవహర్నగర్ కార్పొరేషన్లోని 27వ డివిజన్ కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన 60 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మట్లాడుతూ తెలంగాణ తరహా పథకాలు తమకు కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు ప్రతి నిరుపేదకు సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీహెచ్ జనార్దన్రెడ్డి, ఆంజనేయులు, జహంగిర్, కుమార్, చెన్నారెడ్డి, భానుచందర్రెడ్డి, సత్తిరెడ్డి, రమేశ్, రీనా, విజయలక్ష్మి, ఉపేంద్ర, క్రిష్ణవేణి, కమల, సుభద్ర, విమల, ఉమ తదితరులు పాల్గొన్నారు.