వనస్థలిపురం : ప్రపంచంలో ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగానే బలమైన కార్మిక చట్టాలు వచ్చాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను సచివాలయనగర్లో ఘనంగా నిర్వహించారు.
ఎలక్టీషిన్స్ సంఘం నాయకుడు మకుటం విజయ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు లేకుండా ఏ దేశం మనుగడ సాగించలేదన్నారు. కరోనా సమయంలో కార్మికులు చేసిన సేవలను ఎప్పుడూ మరిచిపోవద్దన్నారు. అనంతం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న కార్మికులను ఘనంగా సన్మానించారు. పారిశుధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్, కటికరెడ్డి అరవింద్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి డైరెక్టర్ కర్నాటి అనిల్ కుమార్, మాదవరం నర్సింహ్మారావు, పోగుల రాంబాబు, కొంగరి మహేష్, రాఘవేందర్రెడ్డి, ఎలక్టీషియన్స్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.