కేపీహెచ్బీ కాలనీ, మార్చి 20 : కేపీహెచ్బీ కాలనీలోని మలేషియన్ టౌన్షిప్ వెనుకాల ఖాళీ స్థలాన్ని ఆహ్లాదకరమైన పార్కుగా అభివృద్ధి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కేపీహెచ్బీ కాలనీ మలేషియన్ టౌన్షిప్ వెనుకాల ఖాళీ స్థలాన్ని, ముస్లిం శ్మశానవాటిక, బాలాజీనగర్ డివిజన్లోని జేఎన్ఎన్ఎంయూఆర్ గృహాలను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మలేషియన్ టౌన్షిప్ వెనుకాల ఖాళీ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని, మొక్కలు నాటి పార్కుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ముస్లిం శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జేఎన్ఎన్ఎంయూఆర్ గృహాలలో వాటర్ లీకేజీ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. కాలనీలో ప్రజా అవసరాల కోసం కమ్యూనిటీహాల్ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే ముళ్లకత్వ చెరువు సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, జీహెచ్ఎంసీ ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, ఏఈలు సాయిప్రసాద్, శ్రీనివాస్, స్థానిక కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలున్నారు.
అల్లాపూర్,మార్చి20: దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజా సంక్షేమాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్ పరిధి యూసుఫ్నగర్లో జరుగుతున్న శ్మశానవాటిక నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ సబీహాబేగం, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యూసుఫ్నగర్ హిందూశ్మశానవాటికను అధునాతన హంగులతో రూ.1కోటి అంచనా వ్యయంతో మోడ్రెన్ వైకుంఠధామంగా తీర్చిదిద్దుమన్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగాల ఐలయ్య, వీరారెడ్డి, పార్వతమ్మ, దుర్గ, జ్ఞానేశ్వర్, జహెద్ షరీఫ్ బాబా, నూర్, ఆయూబ్, అశు, మాధవచారి, రవీంద్రెడ్డి, యోగి, స్వామి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.