కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, ఆయా వర్గాల నేతలు నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన సురేశ్రెడ్డి, మాధవరెడ్డి, రత్నాకర్రెడ్డి, అంజిరెడ్డి, ఫణీందర్రెడ్డి లతో పాటు వంద కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు, మతాలు, ప్రాంతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పార్టీలో చేరిన నేతల కుటుంబాలన్నీ బీఆర్ఎస్ గెలుపుకోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, మాజీ కార్పొరేటర్ బాబూరావు, బండి మధుసూదన్రెడ్డి, ఉపేందర్రెడ్డి, కచిన్, జీఎల్ఎన్రెడ్డి పాల్గొన్నారు.
పంజాబ్, మహారాష్ట్ర, బీహార్ వాసుల మద్దతు
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు రెయింబో గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నివసించే పంజాబ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ర్టాలకు చెందిన పలువురు నివాసితులు సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికొచ్చి స్థిరపడ్డ వారందరికీ ప్రభుత్వం అండగా ఉండి ఆదరించిందన్నారు. అన్ని వర్గాలు కలిసి మెలిసి ఉన్నప్పుడే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ బీఆర్ఎస్కు మద్దతు పలికిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు.