సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ) : జలమండలిలో పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న కన్నోజు మనోహరా చారి ‘తెలంగాణ అభ్యుదయం.. దేశానికి మహోదయం’ పేరుతో రచించిన పుస్తకాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్లో ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వ్యవసాయం, పశుపోషణ, సాగునీరు, విద్య, వైద్యం, మున్సిపల్, పోలీస్, ఐటీ, అటవీ రంగాల్లో గత ఎనిమిదేళ్లలో సాధించిన అభివృద్ధిని ఈ పుస్తకంలో వివరంగా పేరొన్నందుకు రచయితను మంత్రి అభినందించారు. దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ ఐటీ సెక్టార్ ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ దాన కిశోర్, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, దూలం సత్యనారాయణ, శ్రీ హర్ష పాల్గొన్నారు.