నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం కానుంది. నీటి విడుదల ఉత్తర్వుల కోసం త్రిసభ్య కమిటీ భేటీ అవుతుంది. దీని కోసం హైదరాబాద్ జలసౌధలో రెండు కమిటీలు సమావేశం అవుతాయి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదలపై ఈ భేటీలో చర్చ జరుగుతుందని సమాచారం.
జల విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్, వరద జలాల అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. 2022-23లో సాగు, తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై కూడా కమిటీ చర్చిస్తుందట. ఈ సమావేశంలో కృష్నా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు కూడా పాల్గొంటారు. రెండు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై అధికారులు చర్చిస్తారు.