చిక్కడపల్లి, జూలై 31: ‘అంబులెన్స్ 108’ ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని వేతనాన్ని పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం (బీఆర్టీయూ) అధ్యక్షుడు లకావత్ బాలాజీ నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 108 ఉద్యోగులకు 4వ స్లాబ్ (రూ.30,000- 28,000) అమలు చేసిన సందర్భంగా సోమవారం సంఘం అధ్యక్షుడు బాలాజీ నాయక్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్తో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావును కలిసి కృతజ్ఞతులు తెలిపి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, దాదాపు సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2.50 కోట్ల భారం పతుందని వివరించారు. అయినా, కూడా 108 ఉద్యోగులకు సంక్షేమ అందించాలనే ఉద్దేశంతో 4వ స్లాబ్ అమలు చేయడం జరిగిందన్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ వారికి వేతనాలు పెంచుతున్నదన్నారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలాజీ నాయక్, బోయినపల్లి దేవేందర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్లకు కృతజ్ఞతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుల చైతన్య, దస్తగిరి, హరికృష్ణ, కృష్ణ, సురేందర్, స్వామి తదితరలు పాల్గొన్నారు.