విక్టరీ ప్లే గ్రౌండ్లో ప్రారంభించిన మేయర్ విజయలక్ష్మి
ఖైరతాబాద్లోని చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో సోమవారం వేసవి క్రీడా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఓ చిన్నారి వేసిన మల్ కాంబ్ విన్యాసాలు అదరహో అనిపించాయి.
సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): క్రీడలతో మానసిక, శారీర ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ మెరుగుపడుతుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఖైరతాబాద్ జోన్లోని చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో వేసవి క్రీడా శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని 854 క్రీడా మైదానాల్లో 800మంది కోచ్లతో కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సరోజ, జోనల్ కమిషనర్ రవికిరణ్, స్పోర్ట్స్ అధికారి భాషా, జాయింట్ కమిషనర్ జె.యాదయ్య, గేమ్స్ ఇన్స్పెక్టర్ టి.మాధవి, గన్ఫౌండ్రి, గోషామహల్ కార్పొరేటర్లు సురేఖ, లాల్సింగ్, తదితరులు పాల్గొన్నారు.