ఖైరతాబాద్, సెప్టెంబర్ 26 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహా’ నిమజ్జన ఘట్టం షురువైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ “శ్రీ దశ మహా విద్యాగణపతి” నిమజ్జన శోభాయాత్ర గురువారం ఉదయం 7గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనం పూర్తవుతుంది. ఈ మేరకు పోలీసు శాఖ సూచించిన విధంగా మినట్ టు మినట్ను విడుదల చేశారు.
శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు
గణేశ్ శోభాయాత్రకు నగరం సిద్ధమయింది. వీధి వీధినా కొలువైన గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఖైరతాబాద్లో దశ మహా విద్యాగణపతి వీడ్కోలుకూ వేళయింది. మహా నిమజ్జన ఘట్టం పనులు మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. శోభాయాత్రకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా నిఘాతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఉప మండపాల విగ్రహాలను సిద్ధం చేసి, బడా గణేశ్కు తుది పూజ నిర్వహిస్తారు. గురువారం ఉదయం 7 గంటలకు బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు నిమజ్జనంతో ఉత్సవం పూర్తవుతుంది.
నిమజ్జన ప్రక్రియ ఇలా..