Hyderabad | ఖైరతాబాద్ గణనాథుడు అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర వాసులు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు తరలివస్తుంటారు. తమ మొక్కులను చెల్లించుకుంటారు భక్తులు. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఖైరతాబాద్ గణనాథుడు.. ఈ ఏడాది శ్రీ దశమహా విద్యా గణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వినాయక చవితికి 63 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్సవ కమిటీ ప్రకటించింది. విగ్రహానికి కుడి వైపున పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపు వీరభద్ర స్వామి దర్శనమివ్వనున్నారని కమిటీ వెల్లడించింది.