కీసర, డిసెంబర్ 12 : కీసరగుట్ట భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవం పూజలు అన్నాభిషేకంతో ముగిశాయి. మంగళవారం గర్భాలయంలో ఆలయ చైర్మన్ తటాకం రమేశ్ శర్మ, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంను నిర్వహించారు.
అనంతరం గర్భాలయంలో ఉన్న శివుడికి అన్నంతో పూర్తిగా కప్పి అన్నాభిషేకంను నిర్వహించారు.