సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : జిల్లా కలెక్టరేట్లో ఉన్న అన్ని ఆఫీసులు, కలెక్టరేట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిపాలనా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని అన్ని భవనాలు, కార్యాలయాలను కలియ తిరిగారు. ముఖ్యంగా కలెక్టరేట్లో పెరిగిపోతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. కార్యాలయంలో విద్యుత్, నీరు, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే వాటి పనులు పూర్తి చేయాలన్నారు.