జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 15 : తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా.. టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూసుఫ్గూడ కోట్లవిజయభాస్కర్రెడ్డి స్టేడియం ఆవరణలో ఫెడరేషన్ సభ్యులకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఉచిత వైద్య శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్, రక్తదాన శిబిరం, అన్నదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రాకేశ్, పి.విజయ్కుమార్ల బృందం బుధవారం ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీవీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, మైనంపల్లి హనుమంతరావులతో కలిసి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, సముద్రాల వేణుగోపాలచారి, భాషా సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు మామిడి హరికృష్ణ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల డి.సురేశ్కుమార్, కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, ధనలక్ష్మి ట్రస్ట్ చైర్పర్సన్ ధనలక్ష్మి తదితరులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ ఫెడరేషన్ కోశాధికారి నరేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్రాజ్, ఉపాధ్యక్షులు పి.మురళి, కార్యనిర్వాహక కార్యదర్శులు రమేశ్, ఖుద్దూస్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు.