నేరేడ్మెట్, నవంబర్ 2: కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా…బీఆర్ఎస్ ప్రభుత్వంపై గ్లోబల్ ప్రచారం చేసినా…మరో 28 రోజుల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మంచే గెలుస్తుందని…చివరికి ధర్మమే నిలబడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలో రాబో తుందని..హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. గురువారం మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్లో గొడవలు, మతకలహాలతో ఎంతోమంది ప్రజలను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పెద్దగా రాష్ర్టాన్ని, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ, తాగునీటి, కరెంట్ కష్టాలు తీర్చారని స్పష్టం చేశారు. దొరల తెలంగాణ అని కాంగ్రెస్ నేత విమర్శించడాన్ని హరీష్రావు తీవ్రంగా దుయ్యబట్టారు. కేసీఆర్లో దొరతనం..దొంగతనం లాంటి గుణాలు లేవని..ఆయనలో ప్రేమ…దయా గుణంతో రాష్ర్టాన్ని పాలిస్తున్నారని అన్నారు. తలసరి అదాయం, ధాన్యం ఉత్పత్తి, ఐటీ ఉద్యోగాల కల్పన, ఇలా ప్రతి రంగంలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దారని అన్నారు. రాష్ట్రంలో కరువు.. హైదరాబాద్లో కర్ఫ్యూ పరిస్థితులు తలెత్తకుం డా శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ 75-80సీట్లలో విజయం సాధిస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్,బీజేపీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.
అధికారంలోకి రాగానే పింఛన్లు పెంపు
తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా మార్చిన కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే రూ.2వేల ఆసరా పింఛన్ను రూ.5వేలకు పెంచడం తోపాటు మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా ఆడపడుచుల బ్యాంక్ ఖాతాల్లో నెలకు 3వేలు జమ అవుతాయని తెలిపారు. వచ్చే జనవరి నుంచి రేషన్దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కోటి మందికి రూ.5లక్షలకు కేసీఆర్ జీవిత బీమా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను బీజేపీ రూ.1000లకు పెంచి తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400లకే అందించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ లాం టి దోపిడి దొంగలకు కాకుండా సంపద పెంచాలి… పేదలకు పంచాలి అనే నినాదంతో ముందుకుసాగుతున్న కేసీఆర్సర్కారుకు మరోసారి అండగా నిలబడాలని కోరారు.
‘మల్కాజిగిరి’ని పట్టించుకోని రేవంత్రెడ్డి
ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి నాలుగేండ్లుగా మల్కాజిగిరిని పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి విమర్శించారు. ఈఎన్నిక ల్లో కాంగ్రెస్కు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. నిన్నామొన్నటి వరకు కేసీఆర్ గొప్ప అని మట్లాడిన మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు టికెట్ ఇవ్వకపోయేసరికి..స్వార్థం కోసం కాంగ్రెస్లో చేరారని విమర్శించారు. ఏదైన అతిగా చేస్తే ‘ఉన్నది పాయె..’ చందం గా ఈ ఎన్నికల్లో మెదక్తోపాటు మల్కాజిగిరిలో మైనంపల్లి ఓడిపోవడం ఖాయమని మంత్రి వ్యాఖ్యానించారు.
నేతలను భయబ్రాంతులకు గురిచేశారు..
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఒక మచ్చర్ ఫయిల్వన్…నడవడానికి ఆయనకు ముగ్గురు తోడు కావాలని మంత్రి మల్లారెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. ఇక్కడి కార్యకర్తలు, నాయకులను భయపెట్టి, భయబ్రాంతులకు గురి చేశారన్నారు. మైనంపల్లికి దమ్ము లేదని, మైనం‘పిల్లి’గా మల్లారెడ్డి అభివర్ణించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డి, ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.