Hyderabad | హైదరాబాద్ : జైపూర్ – ముంబై రైల్లో కాల్పుల్లో మరణించిన సైఫుద్దీన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. కులీకుతుబ్ షా పట్టణాభివృద్ధి సంస్థలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జియగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని అధికారులను ఆదేశించింది. వితంతు పెన్షన్ కూడా మంజూరు చేసింది. సైఫుద్దీన్ ముగ్గురు కుమార్తెలకు బీఆర్ఎస్ తరపున రూ. 2 లక్షల చొప్పున, మజ్లిస్ తరపున రూ. 1 లక్ష చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న ఎక్స్ప్రెస్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐతో పాటు ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో చేతన్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్కు తరలించారు.