ఖైరతాబాద్, బంజారాహిల్స్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంగళవారం అన్నదానం కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.
సోమాజిగూడ డివిజన్ పరిధిలోని హరిగేట్లో చెవిటిమూగ విద్యార్థులతో పాటు అంగన్వాడీ పిల్లలకు స్థానిక కార్పొరేటర్ వనం సంగీతా శ్రీనివాస్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తితో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ బట్టలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మూడు రోజలు పాటు పండుగలా జరుపుతున్నామన్నారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నా మని, 17న హరితహారం, సీఎం కేసీఆర్ పేరిట యజ్ఞాలు, పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
పంజాగుట్ట నిమ్స్ దవాఖానలో రోగులకు కార్పొరేటర్ వనం సంగీత యాదవ్తో కలిసి పండ్లు, బట్టలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, నాయకులు కె. నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. ద్వారకాపురి కాలనీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. దీంతో పాటు జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు, పేదలకు చీరలను పంపిణీ చేశారు.