సిటీబ్యూరో,ఫిబ్రవరి 17 : తెలంగాణ కలల పంట, అపరభగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం నగర వ్యాప్తంగా పండుగలా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. రక్తదానాలు, అన్నదానం, రోగులు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆలయాల్లో పూజలు చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్న జననేత కేసీఆర్ చల్లగా వర్ధిల్లాలని ప్రజలు ఆశీర్వచనాలు అందించారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా సీఎం ఫొటోలతో కూడిన ఆల్బమ్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, తెలంగాణ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, కార్యదర్శి ఎ.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చాంద్రాయణగుట్ట,ఫిబ్రవరి,17 తెలంగాణ భవన్లో సంక్షేమ పథకాలతో కూడిన కేక్ను కట్ చేస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు
ఉప్పల్లో నిరుపేదలకు చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి
చైతన్యపురిలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేశ్యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, తదితరులు
బాగ్అంబర్పేట డివిజన్ రెడ్బిల్డింగ్ చౌరస్తాలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేస్తున్న అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్
కూకట్పల్లి రామాలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కంటోన్మెంట్ మడ్ఫోర్ట్లోని ప్రభుత్వ పాఠశాలలో క్రీడా పరికరాలను పంపిణీ చేసిన రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్
కార్ఖానాలోని ఆర్కెఎస్ మదర్ థెరిస్సా ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లను పంపిణీ చేసిన రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్