Kavyashree | పీర్జాదిగూడ, మార్చి 21: జాతీయ క్రికెట్ అకాడమీ శిక్షణకు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్, సాయి ఐశ్వర్య కాలనీకి చెందిన గుగులోతు కావ్యశ్రీ ఎంపికైంది. చిన్న నాటి నుంచి క్రికెట్పై మక్కువగా ఉన్న కావ్యశ్రీ పలు టోర్నీలలో పాల్గొంది.
అండర్-15 బాలికల హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడంంతో పాటు అండర్-16 జట్టులోనూ ఆటతీరును మెరుగు పరుచుకుంటూ మహిళా జట్టులోని అరుదైన అవకాశాన్ని వక్కించుకుంది. కావ్యశ్రీ స్థానికంగా ఉన్న ఒమేగ కళాశాలలో ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుకుటుంది. క్రికెట్లో అద్బుత ప్రతిభను కనబరుస్తూ బీసీసీఐకి చెందిన భారత జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణకు ఎంపిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.