హైదరాబాద్: కర్ణాటక బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురి మృతదేహాలు హైదరాబాద్ చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం కర్ణాటకలోని కలబురిగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మరణించారు. వారిలో గోడేకీ కబర్కి చెందిన శివకుమార్, రవళి, దీక్షిత్ మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం పూర్తయింది. దీంతో వారి మృతదేహాలను గాంధీ దవాఖానకు తరలించారు. నేడు వారికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అర్జున్ కుమార్, సరళాదేవి, దివాన్ష్, అనిత మృతదేహాలను నేడు హైదరాబాద్కు తీసుకురానున్నారు. రేపు వారికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, గత నెల 28న గోవాకు వెళ్లిన 26 మంది తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అనుకోని సంఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.