జూబ్లీహిల్స్,జనవరి14: కంటి వెలుగు కార్యక్రమంలో జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది భాగస్వాములై విజయవంతం చేయాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్ కోరారు. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. యూసుఫ్గూడ సర్కిల్లో 5 డివిజన్లలో 5 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా కేంద్రాలలో ప్రతిరోజు సుమారు 2000 మందికి పరీక్షలు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. యూసుఫ్గూడ, రహ్మత్నగర్, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో కంటి వెలుగు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కంటి వెలుగు కేంద్రాలలో పరీక్షల కోసం వచ్చే ప్రజలకు అవవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు ఆయా కేంద్రాలకు పరీక్షలు చేసే పరికరాలు తరలించే పనిలో వైద్య అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఆయా కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ ఈఈ రాజ్కుమార్ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో డీఎంసీ రమేశ్ జీహెచ్ఎంసీ ఏఎంఓహెచ్ డాక్టర బిందు భార్గవి, ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ, వైద్య సిబ్బందితో కంటి వెలుగు ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రత్యేక సిబ్బందితో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.