సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో 274 కంటి వెలుగు కేంద్రాల్లో 9వ రోజు 31,171 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో 9,780 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా 4,866 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశారు.