మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. గురువారం ఆసిఫ్నగర్ తహశీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ చెక్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ స్సేన్,తహశీల్దార్ షేక్ఫర్హీన్తో కలిసి అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే గొప్ప పథకాలు అని పేర్కొన్నారు. అర్హులైన వారికి పథకాలను అందచేయడంలో అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.