శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 2 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం శంషాబాద్ మున్సిపాలిటీ, మండలంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు శంషాబాద్ పట్టణంలోని బేగం ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లీలు చేయడం కోసం ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తిరుగుతూ చూసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకంతో ఎంతో మంది పేదలు పెండ్లీలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పాటు రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నట్లు వివరించారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. 200 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్యాదవ్, ఎన్ఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, సర్పంచ్లు దేవికజగన్గౌడ్,రాజ్కుమార్, కల్పన,మాధవి,ఎంపీటీసీలు యాదయ్యగౌడ్, సరిత రవీందర్, సంగీత, కౌన్సిలర్లు అజేయ్, కుమార్, జాంగీర్ఖాన్, మేకల వెంటకేశ్, సంజయ్యాదవ్, బండి భాగ్యలక్ష్మీ, ప్రవీణ్గౌడ్, చెన్నం అశోక్, రేఖగుప్త, నజీయాబేగం, అమృతారెడ్డి, లక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు.