గోల్నాక, మార్చి 19: పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం సహాయనిధి ఆర్థిక చేయూతనందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 8 మంది బాధితులకు సీఎం రిలీఫ్ నుంచి మంజూరైన రూ.3.85లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన దాదాపు నాలుగేండ్ల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్లాది రూపాయలు బాధితులకు అందజేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి గోల్నాక తులసీనగర్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని అన్నారు.
ఆపత్కాలంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కార్యాలయం అధికారులు దగ్గరుండి అన్ని వివరాలు తీసుకొని సులువుగా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారన్నారు. ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ వీలైనంత త్వరగా బాధితులకు చెక్కులు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. నాయకులు పాల్గొన్నారు.
గోల్నాక, మార్చి 19: అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఎన్నికల బరిలో నిలిచిన జనగాం సత్తిబాబు ప్యానల్ అభ్యర్థులు ఆదివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను మర్యాదపూరక్వకంగా కలిసి మద్దతు కోరారు. కలశం గుర్తుపై ఓటు వేయాలని కరపత్రాన్ని అందజేశారు. సత్తిబాబు ప్యానల్కు చెందిన అభ్యర్థులు అధ్యక్షుడిగా మోర శ్రీరాములుముదిరాజ్, ఉపాధ్యక్షుడిగా కృష్ణాగౌడ్, ప్రధాన కార్యదర్శిగా పంజాల చంద్రశేఖర్గౌడ్, కార్యదర్శిగా కపిల్దేవ్, కార్యనిర్వహణ కార్యదర్శిగా అచ్చిని రమేశ్, కోశాధికారిగా మహేందర్రెడ్డి తదితరులు ఎమ్మెల్యేను కలసిన వారిలో ఉన్నారు.