జాతీయ స్థాయి ఫిట్ ఇండియా పోటీలు
బంజారాహిల్స్, జూలై 22 : విద్యార్థుల్లో వ్యాయామంపై అవగాహన కల్పించడంతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా క్విజ్ పోటీల్లో దేశంలోని 360 పాఠశాలలు పోటీ పడగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబర్చారు.
స్కూల్ తరఫున పోటీపడిన మోహక్ దుగార్, వినాయక్ భరద్వాజ్ వ్యక్తిగతంగా రూ.25వేల బహుమతి సాధించడంతో పాటు స్కూల్కు రూ.25లక్షల బహుమతిని సాధించిపెట్టారు. వారికి శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మంత్రి నితీశ్ ప్రామాణిక్ చేతులమీదుగా బహుమతులు అందించారు. జాతీయ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను స్కూల్ చైర్మన్ మురళీ ముకుంద్, తదితరులు అభినందించారు.