షేక్పేట్, సెప్టెంబర్ 24: ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తున్నదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నిధుల నుంచి షేక్పేట్లో రూ.5 కోట్లతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజలకు సీఎం కేసీఆర్ ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
కోట్ల మంది లబ్ధిదారులు మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టాలని ఆశిస్తున్నారని, వారి కోరిక నెరవేరి కచ్చితంగా హ్యాట్రిక్ విజయంతో తిరిగి అధికార పగ్గాలు బీఆర్ఎస్ పార్టీ చేపడుతుందని దీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు డబుల్బెడ్రూం లబ్ధిదారులు ఎమ్మెల్యే గోపీనాథ్కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్, నాయకులు షకీల్ అహ్మద్, లత, యెల్లెశ్, శ్రీను, రమేశ్, వీరేశ్, సజ్జాద్, అఖిల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.