వెంగళరావునగర్, ఆగస్టు 2: ఏ దిక్కూ లేని అనాథ పిల్లలకు ఇక రాష్ట్ర సర్కారే అమ్మానాన్న అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. హోంలలోని పిల్లలు ఇక రాష్ట్ర పిల్లలుగా కేబినెట్లో గుర్తింపు లభించిన నేపథ్యంలో బుధవారం వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన స్టేట్హోం ఆవరణలోని బాలసదనం, శిశువిహార్లను ఆయన సందర్శించి.. అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాగంటి మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని కాంక్షించే తమ ప్రభుత్వం మానవీయ కోణంలో మహోత్తర నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
హోంలలోని పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వమే అమ్మానాన్నలుగా ఉండబోతున్నదని.. అందరినీ తెలంగాణ బిడ్డలుగా ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. త్వరలోనే ఆర్ఫన్ పాలసీ తీసుకురానున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు హోంలను ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలకు పండ్లు, చాక్లెట్లు, స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, జీటీఎస్ దేవాలయం చైర్మన్ చిన్న రమేశ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్యాదవ్, ప్రదీప్, కృష్ణమోహన్, సంతోష్, విజయ్కుమార్, విజయ్సింహ, సిరాజ్, షరీఫ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.