చిక్కడపల్లి: తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడు ప్రొపెసర్ జయశంకర్ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గాంధీనగర్లో ఆయన విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రాహానికి పూల మాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ,స్థానిక డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, అడిక్మెంట్ డివిజన్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.