ఖైరతాబాద్, డిసెంబర్ 17: 1971లో భారతదేశం శత్రు దేశమైన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించిన నాటి సైనికుల కీర్తిని గుర్తు చేసుకుంటూ 51వ విజయ్ దివస్ వేడుకలు శనివారం నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా, సదరన్ స్టార్ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోల్జర్ నిర్వహించారు.
12.5 కిలోమీటర్ల ఓపెన్ కేటగిరి, కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్స్తో 5కే, మహిళల కోసం 4కే రన్లను శౌర్యచక్ర అవార్డు గ్రహీత మేజర్ జనరల్ ఆర్కే సురేశ్, బ్రిగేడియర్ కె. సోమశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సైనికుల బ్యాండ్ ఆకట్టుకున్నది.