హైదరాబాద్ : ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి పెట్టుబడులు సాధించిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా NRI చాడ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన జయహో రామన్న సాంగ్ను మంత్రి తలసాని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నేడు మల్టీనేషనల్ కంపెనీలు పోటీపడుతున్నాయంటే అదుకు మంత్రి కేటీఆర్ అవిరళ కృషే కారణమన్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటుతో తెలంగాణలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. పారదర్శకమైన పాలన అందిస్తూ మంత్రి కేటీఆర్ యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు అనిల్ కుమార్, ప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఆర్ఐ బిగాల మహేష్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.