టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దాడులు
జవహర్నగర్ తెలంగాణ ఉద్యమకారులు
జవహర్నగర్, మే 31: టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దొంగచాటున గూండాలతో దాడులు చేయిస్తున్నడని, రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని జవహర్నగర్ తెలంగాణ ఉద్యమకారులు అన్నారు. మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం ప్రధాన రహదారిపై రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ.. రెడ్డి సింహగర్జన సభలో పేద రెడ్డిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని మంత్రి మాట్లాడుతుండగానే కిరాయి గూండాలు దాడి చేయడం సర్వసమాజానికి సిగ్గుచేటని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జవహర్నగర్ ఉద్యమకారులు జిట్టా శ్రీనివాస్రెడ్డి, పరశురాం, ప్రకాశ్, ఉపేందర్, ఖాసీం, నర్సింహ, సోమయ్య, మహేశ్, ఇందిరా, మమత తదితరులు పాల్గొన్నారు.