జవహర్నగర్,జూలై 2: దేశంలో ఎక్కడాలేని అభివృద్ధి తెలంగాణలోనే జరుగుతుందని, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజకు సేవ చేస్తునే ఉంటానని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం కార్పొరేషన్లోని 1, 18, 2, 3, 4, 21, 8, 7, 6, 26 డివిజన్లలో రూ. 8కోట్ల 10లక్షలతో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్లతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లతో అభివృద్ధి, సంక్షేమం, ఐటీ, వ్యవసాయం, పరిశ్రమ రంగా ల్లో తిరులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చని తెలంగాణగా మారిందని, రైతులు సంతోషంగా రెండు పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారని అనారు. ఆసియా ఖండంలోనే జవహర్నగర్ కార్పొరేషన్లో అత్యధికంగా నిరుపేదల ప్రజలు నివసిస్తున్నారని, వారికోసం ఎంత చేసిన తక్కువేనని, పదవిలో ఉన్నాలేకున్నా సేవ చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణలోనే జవహర్నగర్ను ఉత్తమ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతానన్నారు. మంత్రి కేటీఆర్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. అంతకుమందు 7వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి ఆధ్వర్యంలో భారీ క్రేన్ సహాయంతో భారీ గజమాలతో మంత్రి మల్లారెడ్డి సన్మానించారు.బోనాలు,డీజేలు,బతుకమ్మలతోమంత్రికి స్వాగతం పలికారు.కార్పొటర్లందరూ సైనికుల్లా పనిచేస్తూ కార్పొరేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, కార్పొరేటర్లు ఏకే మురుగేష్,జిట్టా శ్రీవాణిశ్రీనివాస్రెడ్డి, మెట్టు ఆశాకుమారి, మేక లలితాయాదవ్, సతీష్కుమార్, పానుగంటి బాబు, ప్రేమలశ్రీనివాస్, గొడుగు వేణు, శాంతికోటేష్గౌడ్, యువరాజ్, సుబ్రహ్మణ్యం, శివాజీ, బల్లి రోజా శ్రీనివాస్, నిహారికగౌడ్, నాగరాణివెంకటేశ్గౌడ్, లావణ్యసతీష్గౌడ్, పల్లపు రవి, కోప్షన్సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ మహేశ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయం
మేడ్చల్ రూరల్, జూలై 2: గ్రామాల అభివృద్ధే ధ్యేయం గా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామంలో ఆదివారం యాదవ సంఘం కల్యాణ మండపం, ఎల్లమ్మగుడి, బీరప్పగుడి, మైసమ్మగుడి వద్ద రేకుల షెడ్డు, రజక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి భూమి ఫూజ చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ జడ్పీటీసీ శైలజ, మాజీ ఎంపీపీ పద్మా జగన్రెడ్డి, ఉప సర్పంచ్ పెంటమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, జగన్రెడ్డి, రాజమల్లారెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
సుతారిగూడలో అమ్మవారికి మంత్రి పూజలు
గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని సుతారిగూడ గ్రామ కట్టమైసమ్మ బోనాల పండుగలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండే విధంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు,నాయకులు ఉన్నారు.