19 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం
యూజీడీ లైన్లకు రూ.16కోట్లు: ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 13: చివరి కాలనీ వరకు తాగునీటి సరఫరా అందించడంతో పాటు భూగర్భ డ్రైనేజీ లైన్ల నిర్మాణం చేయిస్తామని, నూతన యూజీడీ లైన్లకు రూ.16కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జలమండలి కార్యాలయంలో ఎండీ దానకిశోర్తో కలిసి నియోజకవర్గంలోని కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 19 కిలోమీటర్ల మేర నూతన తాగునీటి పైపులైన్ పనులు మంజూరయ్యాయని అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత వరదల్లో చాలా కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటి స్థానంలో నూతన పైపులైన్లు వేసేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు.
జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరద ప్రభావంతో పాడైన డ్రైనేజీ లైన్ల స్థానంలో నూతన పైపులైన్లు వేయించేందుకు రూ.16కోట్లు మంజూరు చేయడం జరిగిందని, అవసరమయితే మరో రూ.10కోట్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాస్రావు, జిట్టా రాజశేఖర్రెడ్డి, సామ తిరుమల్రెడ్డి, డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్రెడ్డి, చింతల రవికుమార్, చెన్నగోని శ్రీధర్ గౌడ్, సత్యం చారి, మల్లారెడ్డి, శ్రీనివాస్ నాయక్, భాస్కర్సాగర్, టంగుటూరి నాగరాజు, మల్లేశ్, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.