Minister Sridhar Babu | బడంగ్పేట, ఫిబ్రవరి 19: తెలంగాణ ప్రగతి.. దేశానికి ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని రావిర్యాల హార్డ్వేర్ పార్కులో అపోలో మైక్రో సిస్టమ్స్ (డిఫెన్స్) ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఫ్యాబ్ సిటీలో రిన్యూస్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ఎంఓయూ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఐటీ రంగంలో తెలంగాణ అగ్ర స్థానంలో ఉన్నదన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక ప్రగతి కీలకమన్నారు. ఐటీ ఎగుమతులలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఐటీ రంగానికి పెద్ద పీట వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కాంగ్రెస్ నాయకుడు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.