సికింద్రాబాద్ : నిరుపేదలకు కొండంత అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు శనివారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు గాను సుమారు రూ.2,54,500 విలువల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బోర్డు మాజీ సభ్యుడు శ్యాంకుమార్తో కలిసి ఎమ్మెల్యే సాయన్న అందజేశారు.
కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యులు నర్సింహ్మా ముదిరాజ్, నేతలు నివేదితా, మహంకాళి శర్విన్, నగేష్, నవీన్, కర్ణకుమార్, సంతోష్, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.