సిటీబ్యూరో: ట్రై కమిషనరేట్లలో పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మల్టీజోన్-2 ఐజీగా బదిలీ కాగా, ఆయన స్థానంలో మల్టీజోన్-1 ఐజీగా కొనసాగుతున్న తరుణ్ జోషిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్కుమార్రెడ్డి, ఈస్ట్జోన్ డీసీపీగా గిరిధర్, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమల్ను నియమించారు.