కందుకూరు/పహాడీషరీఫ్, ఆగస్టు 29 : ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఆగమాగమవుతున్నాయని, బీజేపీ, కాంగ్రెస్లు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మత రాజకీయాలకు చోటులేదని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ కుమ్మరి సంఘం అధ్యక్షుడు నేదునూరు ఎంపీటీసీ బాలయ్యతో పాటు ఆ సంఘం రాష్ట్ర నాయకులు 50 మంది, నేదునూరు, మాన్యగూడ గ్రామ బీజేపీ, కాంగ్రెస్ల నుంచి 50 మంది మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామకాలనీకి చెందిన ఆజాద్ యూత్ కమిటీ సభ్యులు మున్సిపల్ బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు దూడల శ్రీనివాస్గౌడ్, యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్ ఆధ్వర్యంలో పార్టీ క్యాంపు కార్యాలయంలో సొంతగూటికి చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… కులవృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ ఎదుగుతున్నదని, ఇతర పార్టీలకు చోటులేదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆజాద్ యూత్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, యూత్ నాయకులు విఘ్నేశ్వర్రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్రెడ్డి, డైరెక్టర్లు పాండురంగారెడ్డి, ఆనంద్, దేవీలాల్ నాయక్, మాజీ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, సర్పంచ్ రామక్రిష్ణారెడ్డి, ఎంపీటీసీ సురేశ్, మాజీ ప్రజాప్రతినిధులు, కుమ్మరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానంద్, బాలయ్య, రాజు, రూప్ చందర్, వెంకటేశ్ గౌడ్, రాజు పాల్గొన్నారు.