చాంద్రాయణగుట్ట, జూలై 8: లాల్ దర్వాజ సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆలయ చైర్మన్ రాజేందర్ యాదవ్ బృందం సభ్యులు శనివారం ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి.. బ్రోచర్ను అందజేశారు. 16న నిర్వహించే బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు అరవింద్ కుమార్ గౌడ్, పోసాని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.