సిటీబ్యూరో, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ) : జిల్లాలోని తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో 2021-22 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశం పొంగే అభ్యర్థులు ప్రవేశ రుసుం లేకుండా వచ్చే 10వ తేదీలోగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్ రోహిణి తెలిపారు.
వచ్చే నెల 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశం పొందాలనుకునే వారు దరఖాస్తు ఫారాన్ని స్టడీ సెంటర్ను సంప్రదించి telanganaopenschool.org ద్వారా పూర్తి చేయాలని సూచించారు. ప్రవేశ రుసుంను డెబిట్/ క్రెడిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ లేదా మీ సేవా, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్లో చెల్లించాలని ఆమె పేర్కొన్నారు.