బంజారాహిల్స్,జూన్ 28 : డా.బీఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కిమ్స్ ఇనిస్టిట్యూట్, దారుస్సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించే ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్)లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ కోర్సులో ప్రవేశం కోసం ఆగస్టు 21న నిర్వహించే అర్హతా పరీక్ష-2022 కోసం ఆన్లైన్లో జూలై 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీకి చెందిన www.braouonline.in పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు ఫారమ్ పూర్తిచేయాలన్నారు. పరీక్ష ఫీజు డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఏపీ.టీఎస్ ఆన్లైన్ ఫ్రాంచైజిల ద్వారా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800 చెల్లించాలని సూచించారు. హాల్ టికెట్స్ను పరీక్షకు రెండురోజుల ముందు యూనివర్సిటీ వెబ్సైట్నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.