Weapons Missing| సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ యూనిట్కు చెందిన ఆయుధ విభాగంలో కొన్ని ఆయుధాలు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఆయుధాల విభాగంలో ఉన్న నాలుగు ఏకే-47 తుపాకులు సహా మరికొన్ని ఆయుధాలు మిస్సింగ్ అయినట్లు ఆర్మీ అధికారులు గుర్తించినట్లు వార్తలు వచ్చాయని తెలిసిందే. కాగా ఆయుధాల చోరీ కేసులో విచారణ కొనసాగుతోంది. ఆయుధాలు చోరీ చేసిన వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆయుధాలు పెట్టిన బేరక్ తలుపులు పగలకొట్టిన దుండగులు 12 కంటే ఎక్కువ ఆయుధాలే చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాలు స్టోరేజ్లో ఉన్న తలుపులు బద్దలు కొట్టి చోరీ చేసినట్టు గుర్తించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మొత్తాన్ని ఆర్మీ హై అలెర్ట్ చేసింది. ఈ క్రమంలో ఆర్మీ అధికారుల క్వార్టర్లతోపాటు రాకపోకలపై అధికారులు నిఘా బెట్టారు. ఆర్మీ క్వార్టర్స్ లోపలికి వెళ్లి వచ్చే వారిని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్మీ అధికారులకు పూర్తిస్థాయిలో ఎస్కార్ట్ పెంచారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న స్టోరేజ్లో చోరీ కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
Biceps | పెద్ద బైసెప్స్ కావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఇలా చేయండి..