సిటీ బ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2లోని పటాన్చెరు నుంచి హైదర్నగర్ 1,500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ లైన్.. హైవే పనుల సందర్భంగా ధ్వంసమైంది. ఈ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
ఎండీ అశోక్రెడ్డి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి, వేగవంతం చేయాలని సూచించారు. అంతరాయం కలిగే ప్రాంతాలు ఆర్సీపురం, అశోక్నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, అమీర్పేట, కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్ తదితర కాలనీలు ఉన్నాయి. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.