ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 19 : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) జువాలజీ విభాగంలో బుధవారం నుంచి అంతర్జాతీయ సదస్సు(International conference)ను నిర్వహించనున్నారు. ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జువాలజీ – ఇన్నోవేషన్స్ చాలెంజెస్ అండ్ అపార్చునిటీస్’అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సు మూడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.
ఓయూ సైన్స్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఉదయం పది గంటలకు నిర్వహించనున్న సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్కుమార్ నందికూరి, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ప్రింటింగ్ అండ్ డయగ్నోసిస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ తంగరాజ్ హాజరవుతారని వివరించారు. ఈ సదస్సుకు విద్యార్థులు, పరిశోధకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.