రంగారెడ్డి : కాలేజీ బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని(Inter student) ఆత్మహత్యాయత్నానికి (Attempts suicide) పాల్పడింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భవాని కాలనీలోని శ్రీ వైష్ణవి మహిళా జూనియర్ కళాశాలలో రితిక అనే బాలిక ఇంటర్ సెకండర్ ఇయర్ చదువుతున్నది.
ఏమైందో తెలియదు కాని బిల్డింగ్ పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలికను హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.