కీసర, డిసెంబర్ 1 : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మీట నొక్కి ఓట్లు వేసిన ఈవీఎంల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. శుక్రవారం కీసర మండలంలోని హోలీమేరి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సంద్భంగా సీపీ డీఎస్ చౌహన్ ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో ఉన్నతాధికారులు, పోలీసులు ఆప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో అధికారులు ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు. హోలీమేరి ఇంజినీరింగ్ కళాశాలో భద్రత ఏర్పాట్లను పరిశీలించి పోలీసు సిబ్బందికి, సెంట్రల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆదివారం మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇక్కడే జరుగుతుందన్నారు.కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ కొనసాగుతుందన్నారు.
కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ 3న ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవాంతరాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. స్ట్రాంగ్ రూంల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుపాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో ఏర్పాటు చేసిన బారీకేడ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింట్ టెబుల్స్ ఇతర అన్ని ఏర్పాట్లు నిశితంగా పరిశీలించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, డీసీపీ జానకి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, జిల్లా పరిశీలకులు ఎస్కే జైన్, పూర్వాగార్గ్, అమన్ మిట్టల్, తదిత రులు పాల్గొన్నారు.