హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఈ నెల 25 నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు గురువారం స్టేడియం ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరు నుంచి 12వ తరగతి పిల్లలకు మ్యాచ్ను ఉచితంగా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సంబంధిత స్కూల్ ప్రిన్సిపాల్స్ చేసిన దరఖాస్తుల ఆధారంగానే విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ఈ నెల 18లోపు హెచ్సీఏ సీఈవో మెయిల్ ఐడీ (ceo.hydca@gmail.com)కి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్సింగ్, కార్యాదర్శి దేవరాజ్, సహాయక కార్యదర్శి బసవరాజు, కోశాధికారి శ్రీనివాస్రావు పాల్గొన్నారు.