ముషీరాబాద్/చిక్కడపల్లి/కవాడిగూడ, ఆగస్టు 15 : భారత స్వాతంత్య్ర వేడుకలు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వైభవంగా జరిగాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్య్ర దిన వేడుకలు అంబరాన్నంటాయి. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కార్పొరేటర్లు సునీతా గౌడ్, ఎం.సుప్రియా నవీన్ గౌడ్, రవిచారి, ఎ.పావని వినయ్కుమార్, రచనశ్రీ, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పార్శిగుట్టలో టీఆర్ఎస్ నేతలు టీ.సోమసుందర్, వైఎస్ఆర్ పార్కువద్ద సాంబశివరావు, రాంనగర్ ఈ సేవ వద్ద నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, వెంకటరామ్రెడ్డి, ముషీరాబాద్, రాంనగర్, అడిక్మెట్ డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సింగ్ప్రసాద్, రావులపాటి మోజస్, బి.శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్స వేడుకలు జరిగాయి. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కేహెచ్ఎస్ జగదాంబ జాతీయ జెండా ఆవిష్కరించారు.
చిక్కడపల్లిలో…
చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయలో సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా కార్యదర్శి పి.పద్మజా, ఉద్యోగ సంఘం నాయకులు శాగంటి అయోద్యలు పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఆవరణలో కమిషనర్ అహ్మద్ నదీమ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆదనపు కమిషనర్ డాక్టర్ గంగాధర్, సంయుక్త కమిషనర్లు శ్యామ్ సుందర్ రెడ్డి, చంద్రశేఖర్లు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటకృష్ణ(బబ్లూ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిచగా నాయకులు ముఠా జయసింహ, ఆర్.మోజస్, మన్నే దామోదర్రెడ్డి, కిషన్ రావు, రాజేంద్ర ప్రసాద్ గౌడ్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించగా గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, ముఠా నరేశ్, ముచ్చకుర్తి ప్రభాకర్లు పాల్గొన్నారు. గాంధీనగర్లో వివిఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిరంజన్, టీఆర్ఎస్ నాయకలు ఆకుల కనకరాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వీఎస్టీలో…
వీఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో యూనియన్ అధ్యక్షుడు వి.శ్రీనివాస్రెడ్డి జెండా ఆవిష్కరించగా యూనియన్ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, ప్రభాకర్లు పాల్గొన్నారు. న్యూస్ పేపర్స్ హాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లేశ్ గౌడ్, శ్రీధర్లు జెండా ఆవిష్కరించారు. గాంధీనగర్లో కార్పొరేటర్ పావని వినయ్కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అడిక్మెట్ టీఆర్ఎస్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్